గవర్నర్‌ విశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ భేటీ

30 Jul, 2019 16:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు, చేసిన తీర్మానాలపైన చర్చించారు. ప్రజాసంక్షేమానికి సంబంధించి తమ పాలన ఎలా ఉండబోతోందన్నది గవర్నర్‌తో సీఎం పంచుకున్నారు. గవర్నర్‌గా ప్రమాణం అనంతరం విశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రికిదే తొలి భేటీ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు