విజయవాడ తరలనున్న వినియోగదారుల ఫోరం ఆఫీస్

6 Jun, 2015 20:00 IST|Sakshi

చిత్తూరు: వినియోగదారుల ఫోరం రాష్ట్ర కమిషన్ కార్యాలయాన్ని త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తామని ఫోరం కమిషనర్ జస్టిస్ నౌషాద్ ఆలీ తెలిపారు. శనివారం తిరుపతికి విచ్చేసిన ఆయన పద్మావతి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి, ఫోరం సేవల గురించి జిల్లా, గ్రామ స్థాయిల్లో విసృతంగా అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే వినియోగ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు