సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో బుధవారం సాయంత్రం మరో 24 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు పాజిటివ్గా తేలినవారిలో ఎక్కువ మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని తెలుస్తోంది.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు - 20
కృష్ణా- 15
వైఎస్సార్- 15
ప్రకాశం- 15
పశ్చిమ గోదావరి- 14
విశాఖపట్నం- 11
తూర్పు గోదావరి- 9
చిత్తూరు- 6
నెల్లూరు- 3
అనంతపురం- 2
కర్నూలు- 1