పట్టాలు దాటబోయి.. ప్రాణాలు కోల్పోయారు

19 Apr, 2015 19:23 IST|Sakshi

జిల్లాలోని అన్నవరంలో విషాదం చోటుచేసుకుంది.  పట్టాలు దాటబోయిన వృద్ధ దంపతులు రైలు ఢీకొని మృత్యువాత పడ్డారు. ఆదివారం సాయంత్రం అన్నవరం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన దంపతులు.. అటుగా వస్తున్న షాలిమర్ ఎక్స్ ప్రెస్ రైలును గమనించలేకపోవడంతో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు. రైల్యే పోలీసులు, స్టేషన్ సిబ్బంది తదుపరి చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు