దేశ సగటును మించి ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నేరాలు
దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 55 మందిపై అఘాయిత్యాలు
ఏపీలో ప్రతి లక్ష మంది మహిళల్లో 65 మందిపై అరాచకాలు
బిహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ కంటే ఏపీలోనే ఎక్కువ
రాష్ట్రంలో 65 శాతం మందికే రక్షిత మంచినీటి సౌకర్యం
నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్థి లక్ష్యాల డాక్యుమెంట్లో స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నేరాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదు. దేశ సగటును మించి రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరుగుతుండడం గమనార్హం. దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 55 మందిపై నేరాలు జరుగుతుండగా, ఏపీలో మాత్రం ప్రతి లక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మహిళపై ప్రధానంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ చేదునిజం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలతో ‘నీతి ఆయోగ్’ నిర్వహించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమీక్షలో వెల్లడైంది.
ఏపీలో 65 శాతం మందికే వంట గ్యాస్ కనెక్షన్లు
నాగాలాండ్లో అతి తక్కువగా ప్రతి లక్ష మంది మహిళల్లో పది మందిపైన నేరాలు జరుగుతున్నట్లు బహిర్గతమైంది. బిహార్లో ప్రతి లక్ష మంది మహిళల్లో 25 మందిపై నేరాలు చోటుచేసుకుంటున్నాయి. మేఘాలయ, ఉత్తరాఖండ్లో ప్రతి లక్షల మంది మహిళల్లో 30 మందిపై నేరాలు జరుగుతుండగా, జార్ఖండ్లో 35 మందిపై నేరాలు జరుగుతున్నట్లు నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్థి లక్ష్యాల డాక్యుమెంట్లో వెల్లడించింది. వివిధ రంగాల్లో రాష్ట్రాలు ఏ స్థితిలో ఉన్నాయనే విషయాన్ని నీతి ఆయోగ్ వివరించింది. దీని ప్రకారం...