తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

11 Aug, 2013 08:09 IST|Sakshi

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావటంతో భక్తులు తిరుమల కొండకకు పోటెత్తారు. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శానికి 22 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటలు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చిన వారు స్వామివారిని దర్శించుకునేందుకు12 గంటలు సమయం పడుతోంది.

నిన్న 71,552 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. నేడు  గరుడ పంచమి సందర్భంగా ఈ రాత్రి 7 గంటలకు శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగనున్నారు.

మరిన్ని వార్తలు