ఒక్క రబ్బరు బుల్లెట్ కూడా ప్రయోగించద్దు: సీఎం కిరణ్

4 Oct, 2013 15:55 IST|Sakshi
ఒక్క రబ్బరు బుల్లెట్ కూడా ప్రయోగించద్దు: సీఎం కిరణ్

సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో.. ముఖ్యంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు అధికారులు, హోం శాఖ కార్యదర్శులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎక్కడా సమైక్యాంధ్ర ఉద్యమకారులపై ఒక్క రబ్బర్‌ బుల్లెట్‌ కూడా ప్రయోగించవద్దని ఆయన స్పష్టం చేశారు.

డీజీపీ బయ్యారపు ప్రసాదరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో పాటు హోం శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు.. సీమాంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాల్లో కూడా శాంతి భద్రతలను పరిరక్షించాలని, అదే సమయంలో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు