రాష్ట్ర విభజనకు కారకుడు బాబే

1 Aug, 2013 17:43 IST|Sakshi

తూ.గో: రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు.  తెలంగాణ రాష్ట ఏర్పాటుకు బాబు అనుకూలంగా లేఖ ఇచ్చినందునే రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోనుందని ఆయన తెలిపారు. వర్తకులు సమైక్యాంధ్రా కోరుతూ వాణిజ్య సముదాయాల్ని మూసివేసి నిరసనను తెలియజేసి బదులు.. నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన చేపడితే బాగుంటుందన్నారు.

 

చంద్రబాబు ద్వంద వైఖరిపై  చంద్రశేఖర్ గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి లేఖలిచ్చి రాష్ర్ట విడిపోయేందుకు బాబు దోహద పడ్డాడని ఆయన విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు