రెచ్చిపోతున్న బ్లేడ్‌ బ్యాచ్‌

8 Mar, 2017 09:31 IST|Sakshi
విజయవాడ: నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డు అదపు లేకుండా పోతోంది.మరోసారి రెచ్చిపోయి  నగర శివారులోని రామలింగేశ్వర నగర్‌ వంతెన వద్ద నుంచి వెళ్తున్న వ్యక్తిపై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి చేసింది. స్థానికంగా నివాసముంటున్న జనపాముల సుబ్బారావు అనే వ్యక్తి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అయనను వంతెనపై అడ్డగించారు.
 
జేబులోని డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీనికి సుబ్బారావు నిరాకరించడంతో, బ్యాచ్‌లోని ఓ యువకుడు బ్లేడుతో ఆయనపై దాడి చేశాడు. బాధితుడి ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. దీంతో సుబ్బారావు కేకలు వేశాడు. ఇది గుర్తించిన స్థానికులు బ్లేడ్ బ్యాచ్ సభ్యులను పట్టుకోవడానికి యత్నించగా, ఓ యువకుడు వారి చేతికి చిక్కాడు. దీంతో అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరు దుండగుల కోసం గాలింపులు చర్యలు ముమ్మరం చేశారు. 
మరిన్ని వార్తలు