అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

18 Feb, 2015 09:51 IST|Sakshi

పులివెందుల :  అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన గంగాధర్(39) అనే రైతు ఏడు ఎకరాలలో పంటను సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో అప్పులు పెరిగాయి.

దీంతో మనస్తాపం చెందిన రైతు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని కేసు నమోదు చేశారు. కాగా, మృతుడు గంగాధర్ కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు