విద్యుదాఘాతంతో రైతు మృతి

3 Sep, 2015 10:39 IST|Sakshi

రాయదుర్గం (అనంతపురం): వ్యవసాయ మోటర్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఒక రైతు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదంగొల్లలదొడ్డిలో గురువారం ఉదయం జరిగింది. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు