రైతు ఆత్మహత్య

3 Sep, 2015 10:44 IST|Sakshi

కోరుట్ల(కరీంనగర్): అప్పుల బాధతో ఉరేసుకొని చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపురం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన రిబ్బాస రాజమల్లయ్య(48) తనకున్న ఎకరం భూమిలో మొక్కజొన్న సాగుచేసుకోవడతంఓ పాటు గొర్ల పెపకం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో భార్య అనారోగ్యానికి గురికావడంతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక పోవడంతో.. అప్పులు పెరిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు