దాబాలో అగ్నిప్రమాదం

4 Mar, 2018 15:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సాగర్‌నగర్‌ సన్‌రేస్‌ దాబాలో అగ్ని ప్రమాదం సంభవించింది. చెత్తకుప్పలను తగలబెడుతుండగా గాలికి నిప్పులురవ్వలు దాబాలో గడ్డితో వేసిన గుడిసెలపై పడటంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల ఆస్తినష్టం జరిగినట్లు దాబా నిర్వాహకులు ఆరోపించారు. అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరికొన్ని అగ్నిమాపక యంత్రాలు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు