విజయవాడలో అగ్ని ప్రమాదం 

15 Apr, 2019 17:48 IST|Sakshi

విజయవాడ: నగరంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. బీసెంట్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌  కారణంగా మంటలు చెలరేగాయి.  దీంతో షాపులోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 10 లక్షల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం.  రెండో అంతస్థులో ఉన్న దుకాణంలో మంటలు ఎగసి పడటంతో కాంప్లెక్స్‌లోని వ్యాపారులు ఆందోళన చెందారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు