'ప్రభుత్వ విధానం తప్పులతడక'

28 Jan, 2015 14:46 IST|Sakshi

ఇసుక రవాణ అంశంపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం తప్పుల తడకగా ఉందని అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఆలూరి సాంబశివారెడ్డి మంగళవారం విమర్శించారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వ నియమాలను సడలించాలని బుధవారం అనంతపురం జిల్లా సింగమల మండలం ఉలికల్లులో వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఆలూరి సాంబశివారెడ్డి, సీపీఐ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డితో పాటు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు