ప్రతి మండలంలోనూ నిర్వహణ
మొత్తం దరఖాస్తులు 7,92,334
ఒక ఊరి నుంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకే రోజు ఇంటర్వూ్య
50 మార్కులకు ఇంటర్వూ్య.. ఆ మార్కుల ఆధారంగానే ఎంపిక
జిల్లా అధికారులతో కమిషనర్ గిరిజా శంకర్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్లకు గురువారం నుంచి ప్రతి మండలంలోనూ ఇంటర్వూ్యలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్వూ్యలలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను వివరించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 1,81,885 వలంటీర్ల నియామకానికి గానూ 7,92,334 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 7,59,609 మంది దరఖాస్తులను సక్రమమైనవిగా తేల్చగా.. మరో 2,761 దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. వలంటీర్గా పనిచేసే వ్యక్తికి ఉండాల్సిన అర్హత ప్రమాణాలపై మొత్తం 50 మార్కులకు ప్రతి దరఖాస్తుదారునికీ ఇంటర్వూ్య నిర్వహిస్తారు. ఇంటర్వూ్యలో ఉండే ముగ్గురు అధికారుల్లో చైర్మన్కు 50 మార్కులు, మిగిలిన ఇద్దరు సభ్యులకు కలిపి 50 మార్కులు కేటాయిస్తారు. వారు అభ్యర్థికి వేసిన మార్కులను 50 మార్కుల సగటును లెక్కిస్తారు. అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని ఎంపిక చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ పోస్టులుగా వర్గీకరిస్తారు. కాగా ఒక గ్రామంలో వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకే రోజున ఇంటర్వూ్య
జరపాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్వూ్యలు ఇలా..