తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ

30 Jun, 2013 15:46 IST|Sakshi

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం భక్తులతో మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 27 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనానికి 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అయితే భక్తుల రద్దీ పెరిగిన కారణంగా శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతోందని టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్యూలైన్ల,కంపార్ట్ మెంటుల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, పాలు, మజ్జిగా, నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు