దళిత పేదలను ఆదుకో అన్నా...

18 Jul, 2018 07:19 IST|Sakshi
రామేశ్వరం వద్ద జగన్‌కు సమస్యలను విన్నవించిన దళిత మహిళలు

తూర్పుగోదావరి : శ్రమను నమ్ముకుని బతుకుతున్నామయ్యా.. స్థిరాస్తులంటూ ఏమీ లేవు... మా బతుకులు కష్టంగా సాగుతున్నాయి.. మా పిల్లలను కష్టపడి చదివిస్తున్నాం.. వారికో దారి చూపయ్యా.. అంటూ రామేశ్వరానికి చెందిన దళిత మహిళలు పాదయాత్రలో రామేశ్వరం వద్ద జగన్‌ను కలిసి వారి స్థితిగతులను చెప్పుకొన్నారు. దళిత రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ పథకాల్లో దళితుల ప్రాధాన్యాన్ని మరింత పెంచాలని ప్లకార్డులను ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు