బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కాం!

2 Aug, 2019 14:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు: బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కామ్‌ బయటపడింది. దాదాపు రూ. 52 లక్షల నిధులను ఆసుపత్రి సూపరింటెండ్‌ ఆశీర్వాదం స్వాహా చేసినట్టు ఆడిట్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆశీర్వాదంతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో ఈ ముగ్గురిపై ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్‌ ప్రసన్నకుమార్‌ కేసు పెట్టారు. కాగా, ఆశీర్వాదం ఇటీవలే బదిలీపై వైజాగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.  

>
మరిన్ని వార్తలు