భార్యను గొంతు కోసి చంపిన భర్త

8 Feb, 2016 15:11 IST|Sakshi

దర్శి (ప్రకాశం జిల్లా) : దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామంలో సోమవారం భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఓ  ప్రబుద్ధుడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య అంకాల నర్సమ్మ(30) అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు అంకాల నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు