'ఏప్రిల్ 14న రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తా'

24 Mar, 2015 13:28 IST|Sakshi
'ఏప్రిల్ 14న రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తా'

గుంటూరు : తన రాజకీయ భవిష్యత్ను ఏప్రిల్ 14న ప్రకటిస్తానని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.  ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. డొక్కా మాణిక్య వరప్రసాద్  మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణా కరకట్టను హైదరాబాద్లోని ట్యాంక్బండ్లా అభివృద్ధి చేయాలన్నారు. కరకట్ట మీద తెలుగు రాష్ట్రాల మహానేతల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు కూడా తెలుగునాడు అని పేరు పెట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు