నిజామాబాద్ రూరల్ నుంచి పోటి చేస్తా: డీఎస్

23 Mar, 2014 14:26 IST|Sakshi
నిజామాబాద్ రూరల్ నుంచి పోటి చేస్తా: డీఎస్
న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో చేదు అనుభవాన్ని మిగిల్చిన నిజామాబాద్ అర్భన్ స్థానం నుంచి పోటీ చేయడానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నిరాసక్తతతను ప్రదర్శిస్తున్నారు.  2014 ఎన్నికల్లో డీఎస్ స్థాన మార్పిడి కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజమాబాద్ అర్భన్ స్థానం నుంచి కాకుండా రూరల్ స్థానాని కేటాయించాలని స్ర్కీనింగ్ కమిటికి డీఎస్ విజ్క్షప్తి చేశారు. 
 
గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్భన్ స్థానంలో పోటి చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గతంలో రెండుస్తార్లు ఓటమి చవిచూసిన డీఎస్ ఈ ఎన్నికల్లో అర్భన్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. స్క్రీనింగ్ కమిటీని కలిసిన కాంగ్రెస్ నేతల్లో భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, సిరిసిల్ల రాజయ్య, జైపాల్‌రెడ్డి, డీఎస్‌లున్నారు. 
మరిన్ని వార్తలు