సాక్షి, అమరావతి: తన ఎంపీ పదవికి రాజీ నామా చేయాలన్న నిర్ణయాన్ని విరమిం చుకున్నట్టు అనంత పురం ఎంపీ జేసీ దివా కర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగ పూడి తాత్కాలిక సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబును కలసిన అనంతరం జేసీ విలేకర్లతో మాట్లాడారు. బాధాతప్త హృదయంతో ఇటీవల రాజీనామా చేస్తానని అన్నానని.. కానీ వెంటనే సీఎం స్పందించి అనంతపురం ప్రజల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అందుకే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు.