విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్లు(జూడాలు) సమావేశమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కామినేనికి జూడాలు విజ్క్షప్తి చేశారు. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపు సాయంత్రం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని జూడాలు తెలిపారు.
సమస్యల పరిష్కరించాలని హెల్త్ సెక్రెటరీ, డీఎంఈ, మంత్రి సమక్షంలో జూడాలు చర్చలు జరుపనున్నారు. చర్చల తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని జూడాలు వెల్లడించారు.