చంద్రబాబుతో కేజ్రీవాల్‌ సమావేశం

19 Feb, 2019 03:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సోమవారం రాత్రి వచ్చిన కేజ్రీవాల్‌ గంటకుపైగా సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. త్వరలో ఢిల్లీలో బీజేపీయేతర  పార్టీల సమావేశం ఉండడంతో దానిపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌ వెంట ఢిల్లీ డిప్యూటి సీఎం సిసోడియా తదితరులున్నారు. 

>
మరిన్ని వార్తలు