'అనంతలో కరువును నివారించాలి'

1 Apr, 2015 12:53 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువును నివారించేందుకు చర్యలు చేపట్టాలని వామపక్ష కార్యకర్తలు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుగొండలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్ష కార్యకర్తలు నిరసన తెలిపారు. జిల్లా కరువు కోరల్లో చిక్కుకుని ఉందని... అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని వారు ఆరోపించారు. ఈ నిరసనలో సీపీఐ, సీపీఐ ఎం చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు