మడకశిర పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్!

1 Jul, 2014 09:54 IST|Sakshi
మడకశిర పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్!

అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. బషీర్ అనే యువకుడు పోలీసుల అదుపులో ఉండగా మరణించారు. అతడిని పోలీసులే కొట్టి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందున్న పూల కుండీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి పోలీసులను దూషించారు.

వివరాల్లోకి వెళితే మడకశిర మండలం కల్లుమర్రికి చెందిన బషీర్ ట్రాక్టర్ ట్రాలీ చోరీ కేసులో గత నాలుగు రోజుల క్రిందట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రతిరోజు అతడిని రాత్రి వేళల ఇంటికి పంపేవారు. అయితే నిన్న రాత్రి లాకప్లోనే ఉంచారు. అయితే బషీర్ ఉరి వేసుకుని చనిపోయాడని చెబుతుండగా బంధువులు మాత్రం పోలీసులే చంపారని ఆరోపిస్తూ పీఎస్పై దాడికి దిగారు.


 

మరిన్ని వార్తలు