విద్యుత్ స్తంభాలను ఢీకొన్న లారీ

14 Sep, 2015 15:33 IST|Sakshi

చుండుపల్లె (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు లారీ ఢీకొని నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతోపాటు తీగలు తెగిపోయాయి. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా కాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే ..చుండుపల్లె పట్టణం శివాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఇనుప తుక్కు లోడు లారీని రివర్స్ చేస్తుండగా వెనుకనున్న విద్యుత్ స్తంభాలను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు.

దీంతో వరుసగా నాలుగు స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగి రహదారిపై పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో కరెంటు సరఫరా లేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లారీకి, డ్రైవర్‌కు కూడా ఎటువంటి అపాయం సంభవించలేదు.

మరిన్ని వార్తలు