విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

18 Nov, 2015 20:16 IST|Sakshi

యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన యలమంచిలిలోని మేడపాడు ఏయిర్‌టెల్ సెల్‌టవర్ వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని కట్టుపాలెం గ్రామానికి చెందిన గెద్దాడ మధు(35) ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఏయిర్‌టెల్ టవర్ వద్ద జన్‌రేటర్ బాగు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.


 

>
మరిన్ని వార్తలు