జనాలపైకి దూసుకెళ్లిన క్రేన్:వ్యక్తి మృతి

8 Apr, 2016 09:35 IST|Sakshi

ఏలేశ్వరం: వేగంగా వెళ్తున్న క్రేన్ ముందు వెళ్తున్న ద్విచక్రవాహానాన్ని ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ  ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక బాలాజీ చౌక్ సెంటర్‌లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేప పూత అమ్ముతున్న వ్యక్తి పైకి క్రేన్ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు