పెనుమూడిలో వ్యక్తి దారుణ హత్య

15 Apr, 2016 10:43 IST|Sakshi

రేపల్లె : గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్ధానికంగా నివాసముండే కుక్కలిగడ్డ నాగఫణీంద్ర(24) అనే వ్యక్తి ని సొంత బావమరిది నాగిడి నాగరాజు కత్తులతో పొడిచాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు