ఇద్దరి ప్రాణాలు తీసిన అనుమానం

2 Sep, 2014 09:59 IST|Sakshi

కడప :  వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో విషాదం చోటుచేసుకుంది. అనుమానం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, కట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికాడు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు