సాక్షి, నెల్లూరు : మంత్రి మేకపాటి గౌతం రెడ్డి బుధవారం అనంతసాగరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా గౌతం రెడ్డి అనంతసాగరంలో గృహనిర్మాణ కార్యలయాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడమే కాక.. స్థానిక పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.