మంత్రులు మహీధర్‌రెడ్డి, విశ్వరూప్ రాజీనామా

3 Aug, 2013 02:14 IST|Sakshi
రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీ నామా చేశారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శాసనసభ్యత్వంతోపాటు ప్రకాశం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామాలు చేసిన వారిలో విశాఖ జిల్లా భీమిలి ఎమ్మె ల్యే అవంతి శ్రీనివాస్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే మళ్ల విజ యప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మె ల్యే పాముల రాజేశ్వరి, విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాలపాప ఉన్నారు. ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ఎమ్మెల్యే  పదవికి, విప్ పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు, సీఎంకు లేఖలు పంపారు.
మరిన్ని వార్తలు