కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య

2 Mar, 2015 15:00 IST|Sakshi
కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య

హిందూపూర్ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఇతర రాష్ట్రాలకు లేని ఇబ్బంది కేంద్రానికి ఎందుకని నిలదీశారు. హంద్రీ నీవా కాలువ పనుల పర్యవేక్షణ కోసం అనంతపురం జిల్లాకు వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.

సాధారణ, రైల్వే బడ్జెట్లు రెండింటిలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. టీడీపీ- బీజేపీ కూటమిని గెలిపించిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్య విధానాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు