పెనుకొండలో పెనువిషాదం

20 Oct, 2019 21:26 IST|Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుంటుబ కలహాలతో కళావతి అనే మహిళ తన నలుగురు పిల్లలకు విషం ఇచ్చి.. తరువాత తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని గుర్తించిన స్థానికులు తల్లి కళావతి, పిల్లలు అంజలి, రమేష్, రాజశేఖర్, వైష్ణవిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మద్యానికి బానిసైన భర్త వెంకటేష్ కుటుంబాన్ని పట్టించుకోలేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు