ఎంఎస్ఎంఈడీసీఐ చైర్మన్ రామారావు
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముద్ర’ రుణాలు పొందేందుకు ఎలాంటి హామీలు అవసరం లేదని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బి.వి.రామారావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఆదివారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి హామీలు లేకుండానే రూ. 50 వేలు నుంచి రూ.10 లక్షల వరకు రుణా లు పొందవచ్చని తెలిపారు. బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వకుంటే తనకు ఫోన్ చేయాలని చెప్పారు. 9866649369, 8179422248లో ఎప్పుడు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. బ్యాంకు అధికారులకు రుణ దరఖాస్తు అందించిన వెంటనే రశీదు తీసుకోవాలని సూచించారు.