-

చెత్తకుప్పలో ఆడశిశువు మృతదేహం

17 Jul, 2015 16:09 IST|Sakshi

కోస్గి : కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని సజ్జెలగూడెం గ్రామ శివార్లలోని చెత్తకుప్పల్లో ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది. శుక్రవారం మధ్యాహ్నం కొందరు మహిళలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువు వయసు ఒక రోజు ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు