కర్నూలు: కట్నం వేధింపులకు బనగానపల్లెలో నవవధువు హిమబిందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ హిమబిందు బుధవారం మృతి చెందింది.
అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించేవారని బంధువులు చెబుతున్నారు. భర్త, అత్తమామ, ఆడపడచును పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబాన్ని ఎస్పీ రవికృష్ణ పరామర్శించారు.