రెండు బైకులు ఢీ : ఒకరు మృతి

27 Aug, 2015 17:11 IST|Sakshi

మర్రిపూడి (ప్రకాశం) : వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కూచిపుడి సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిమ్మటం గ్రామానికి చెందిన బి.రమేష్(26) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం బైక్ పై చిమ్మటం నుంచి మర్రిపూడి వెళ్తున్న సమయంలో బైక్ కూచిపడి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది.

ఈ ప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతనితోపాటు బైక్‌పై ఉన్న అదే గ్రామానికి చెందిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్రవాహనంపై ఉన్న నారిశెట్టి బల రాంరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు