అన్నొచ్చాడోచ్‌..

20 Sep, 2018 06:51 IST|Sakshi

ప్రజా సంకల్పయాత్ర బుధవారం సెంచూరియన్‌ యూనివర్సిటీ ముందు నుంచి వెళ్లడంతో విద్యార్థులంతా జననేతతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పారామెడికల్, బీఎస్సీ చదువుతున్న వీరంతా వైఎస్‌ జగన్‌ను కలిశారు. అన్నా నువ్వే గెలవాలి. నువ్వే సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ యూనివర్సిటీలో చదివిన వారికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తించడం లేదన్నా అంటూ మాణిక్య వీణ, మేఘన, నవ్వశ్రీ, వైష్ణవి, నవ్య, మీనా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏడాదికి రూ.70 వేలు చెల్లిస్తున్నామన్నా. ఫీజురీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు చేస్తే ఆన్‌లైన్‌లో చూపించడం లేదంటూ వాపోయారు. నువ్వు సీఎం అయితే మాలాంటి విద్యార్థుల కష్టాలు తీరుతాయి.. నీ గెలుపునకు మేమంతా కృషి చేస్తామంటూ నినాదాలు చేశారు. 

మరిన్ని వార్తలు