పాస్‌పోర్ట్‌కు ఆధార్ అనుసంధానం

14 May, 2015 18:56 IST|Sakshi
పాస్‌పోర్ట్‌కు ఆధార్ అనుసంధానం

విశాఖపట్నం: పాస్‌పోర్ట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నట్టు విశాఖపట్నం పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నవారు, ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉన్నవారు ఆధార్ నంబరును అనుసంధానం చేయాలన్నారు. విశాఖ పాస్‌పోర్ట్ సేవాకేంద్రంలో ఈనెల 11 నుంచి అనుసంధాన ప్రక్రియ ప్రారంభించినట్టు చెప్పారు.

దేశంలో ఆధార్ నమోదు కోసం ఎంపిక చేసిన ఆరు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల్లో విశాఖ ఒకటని తెలిపారు. త్వరలోనే పాస్‌పోర్టులకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్రం ఆదేశించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు