కడపలో పాస్‌పోర్ట్‌ కార్యాలయం ప్రారంభం

4 Apr, 2017 01:26 IST|Sakshi
కడపలో పాస్‌పోర్ట్‌ కార్యాలయం ప్రారంభం

జిల్లా ప్రజల కల నెరవేరిందన్న ఎంపీ అవినాష్‌రెడ్డి

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లా కడపలో సోమవారం పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందన్నారు.

కడపలో పాస్‌పోర్ట్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రం కడపతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.  
 

మరిన్ని వార్తలు