రూ.5.50 లక్షల గుట్కా స్వాధీనం

21 Nov, 2015 13:19 IST|Sakshi

గుంటూరు ఆటోనగర్‌లో పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, ఖైనీని స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శేషారావు ఆధ్వర్యంలో పెద్దకాకాని పోలీసులు శనివారం ఉదయం ఆటోనగర్‌లోని ఓ గోదాముపై దాడి చేశారు. గోదాములో ఉన్న రూ.5.50 లక్షల విలువైన గుట్కా, రాజా ఖైనీని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన గోదాము యజమాని ఉడతా రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు