పోస్టాఫీసులకు తాళాలు

19 Mar, 2015 12:10 IST|Sakshi

గుంటూరు : గ్రామీణ తపాలా ఉద్యోగుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. గురువారం గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రధాన పోస్టాఫీసుతోపాటు సబ్ పోస్టాఫీసులకు ఉద్యోగులు తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రధాన తపాలా ఉద్యోగుల వేతనాల స్థాయిలో తమకూ వేతనాలు ఇవ్వాలని, ఇందుకోసం జ్యుడీషియల్ కమిటీ వేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు ఏఐటీయూసీ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.
(రేపల్లె)

మరిన్ని వార్తలు