95 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

7 Oct, 2015 14:17 IST|Sakshi

కోయల్ కుంట్ల: కర్నూలు జిల్లా కోయల్‌ కుంట్ల మండలం సమీపంలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం నుంచి మినీ ఆల్విన్, టెంపో వాహనాలలో రేషన్ బియ్యం తరలుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. 95 బస్తాలలోతరలుతున్న47 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు