రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

17 Mar, 2016 08:49 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట కేఎంఎం కళాశాల ప్రాంతంలో గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 28 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టవేరా వాహనంతోపాటు ఎర్రచందనం కూలీలకు చెందిన బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

అయితే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎర్రచందనం కూలీల జాడ మాత్రం తెలియరాలేదు. తమను  గమనించి కూలీలు పరారైనట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతుంది.

>
మరిన్ని వార్తలు