రెడ్డి సుబ్రమణ్యానికి తప్పిన ప్రమాదం

12 Sep, 2017 10:54 IST|Sakshi

సాక్షి, ఏలూరు: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.  అదుపుతప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న మరో మూడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఇన్నోవా ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టింది.

ఆ వెంటనే మరో మూడు వాహనాలను ఢీకొడుతూ ఇన్నోవా బీభత్సం సృష్టించింది. ధ్వంసమైన వాహనాలలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఉంది. ఆ సమయంలో పోలీసులు వాహనంలో లేకపోవడంతో వారికి ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు