హోంమంత్రి కాన్వాయ్‌లో మంటలు

5 Jan, 2018 11:36 IST|Sakshi

సాక్షి, విశాఖ: ఏపీ హోంమంత్రి చినరాజప్ప కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఎస్కార్ట్‌ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నారు.

విశాఖ జిల్లాలోని కొండల అగ్రహారం వద్ద ఈ ఘటన జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారంణంగా మంటలు చెలరేగినట్టు సిబ్బంది చెప్పారు. ప్రమాద సమయంలో చినరాజప్ప కాన్వాయ్‌లో లేరని తెలుస్తోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు