-
చినరాజప్పకు ఆరోగ్యం సహకరించడం లేదు.. ఈ సారి టికెట్ నాకే ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో సిట్టింగ్లకే సీట్లు అని చంద్రబాబు ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ.. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆయన చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జనసేనతో పొత్తు టీడీపీలో మరింత అగ్గి రాజేస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ పారీ్టలోని చంద్రబాబు సొంత సామాజికవర్గ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాటి ప్రకటనలతో సంబంధం లేకుండా ఆరు నూరైనా సరే ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన సొంత సామాజికవర్గం తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. మూడు సీట్ల ఆనవాయితీపై సిగపట్లు ఉమ్మడి జిల్లాలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొదటి నుంచి పెద్దాపురం, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్లో టీడీపీ తమకే ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు సామాజికవర్గ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి పొత్తులో రాజానగరాన్ని జనసేనకు వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగిలిన మూడింటికి సంబంధించి మండపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని ‘రా.. కదలి రా’ సభలో చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం రూరల్పై ఇరు పార్టీల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. ఇక మిగిలిన పెద్దాపురం సీటు టీడీపీ ఆవిర్భావం నుంచీ చంద్రబాబు సామాజికవర్గానికే దక్కుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు చివరి రోజుల్లో ఆ స్థానం కోసం విఫల యత్నం చేశారు కూడా. అయితే, గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ సీటును కోనసీమ నుంచి తీసుకువచ్చిన కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఇస్తూ వస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ సీటు చినరాజప్పకేనని చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. అప్పటి నుంచీ పెద్దాపురం టీడీపీలో రెండు సామాజికవర్గాలూ ఈ సీటు కోసం నువ్వా, నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. దీని ప్రభావం ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పడుతోంది. పెద్దాపురంపై గుణ్ణం కన్ను మొదటి నుంచీ ఆనవాయితీగా ఇస్తున్న పెద్దాపురం సీటు కోసం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన గుణ్ణం చంద్రమౌళి పావులు కదుపుతున్నారు. రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన తరువాత మౌళి పెద్దాపురంపై గట్టి పట్టే పడుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయనకు లోకేష్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. కొంత కాలం నుంచి ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు జరిపిన పర్యటనలకు మౌళి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో తమకు పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి వారి ఆశీస్సులున్నాయని మౌళి వర్గం ప్రచారం చేసుకుంటోంది. రాజప్పకు వ్యతిరేకంగా.. ఇద్దరూ ఒక్కటై.. చినరాజప్పకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని వైరి వర్గం చెబుతోంది. ఈ విషయాన్ని రా.. కదలి రా కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ కాతేరు వచ్చిన చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజప్పకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చంద్రమౌళికి దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు, టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి వెంకట రమణ చౌదరి వర్గం పరోక్షంగా మద్దతు ఇస్తోంది. అయితే, ఆవిర్భావం నుంచీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉమ్మడి జిల్లాలో పార్టీకి సుదీర్ఘ కాలం సారథ్యం వహించిన రాజప్ప సీటుకు ఢోకా లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మౌళి వర్గాన్ని దీటుగా ఎదుర్కొనే సత్తా తమకు లేకపోలేదని అంటున్నారు. రాజానగరం సీటుపై వెంకట రమణ చౌదరి పెట్టుకున్న ఆశలపై జనసేన నీళ్లు చల్లడంతో.. ఆయన, మౌళి కలసి ఉమ్మడి కార్యాచరణతో చినరాజప్పకు పొగ పెడుతున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికా అన్నట్టు వెంకట రమణ చౌదరికి రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని చూపించి బుజ్జగించేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీడీపీలో వర్గ విభేదాలు మరింత ముదురు పాకాన పడేలా కనిపిస్తున్నాయి. ఖర్చు మాది.. సీటు ఆయనదా! పెద్దాపురం వరుసగా రెండుసార్లు రాజప్పకు కట్టబెట్టారని, ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకే ఇస్తామంటే సహించేది లేదంటూ చంద్రబాబుపై ఆయన సామాజికవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చినరాజప్పకు వ్యతిరేకంగా మౌళి పలు వర్గాలను ఏకం చేసే పనిలో ఉండటంతో పెద్దాపురంలో పార్టీ రెండు వర్గాలుగా విడిచిపోయింది. ఈ సీటుపై ఆశతో ఏడాది కాలం నుంచి పార్టీ కోసం లక్షల రూపాయలు తగలేసుకుంటుంటే.. ఇప్పుడు సిట్టింగ్కే ఇస్తామంటే ఎలా సహకరిస్తామంటూ.. పెద్దాపురం నియోజకవర్గంలోని చంద్రబాబు సామాజికవర్గ నేతలు చినరాజప్పను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చినరాజప్పకు అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని, ఈసారి తమ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకుంటే తాడోపేడో తేలుస్తామని స్పష్టం చేస్తున్నారు. 2014లో స్థానికేతరుడైన చినరాజప్పకు సీటు ప్రకటించినప్పుడు ఆయన వాహనాలను ధ్వంసం చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్న నాటి పరిస్థితులను వారు గుర్తు చేస్తున్నారు. -
అంటే బయటకన్నా ఆయనకు జైలే బాగుందంటా?!
అంటే బయటకన్నా.. ఆయనకు జైలే బాగుందంటా?! -
ప్రెస్మీట్ పేరుతో సభ.. టీడీపీ నేతల అరెస్ట్
రౌతులపూడి: నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్మీట్ పేరిట సభ నిర్వహించేందుకు యత్నించిన టీడీపీ నాయకులను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, సుందరకోట శివారు బమిడికలొద్దులో చేపట్టిన బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు తదితరులు గిరిజన ప్రాంతాలైన జల్దాం, చల్లూరు, దబ్బాదిలో పర్యటించారు. తర్వాత వీరు రౌతులపూడి చేరుకున్నారు. ప్రెస్మీట్ పేరుతో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలతో పోలీసులు చర్చించినా వినలేదు. దీంతో చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జ్ వరుపుల రాజా, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంగలపూడి అనిత, వంతల రాజేశ్వరి, బి.రామానాయడు, శ్రావణ్కుమార్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్కుమార్, తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోటనందూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం విడుదల చేశారు. -
టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు మహానాడు వేదికగా మాటల యుద్దానికి దిగారు. చంద్రబాబు ముందే టీడీపీ నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఒకరినొకరు విమర్శించున్నారు. ఈ క్రమంలో చినరాజప్ప మాట్లాడుతూ.. కొంత మంది నేతలు అధికారం పోగానే పార్టీని వీడిపోయారని అన్నారు. తిరిగి వెళ్లిపోయిన వారిని పార్టీలోకి తీసుకోమని తెలిపారు. మాజీ మంత్రలు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో లేకుంటే పార్టీని పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఎవరు ఏ విధంగా వ్వవహారిస్తున్నారో చంద్రబాబు గమనించాలని చినరాజప్ప అన్నారు. (‘రెండు కుటుంబాల గొడవను రాజకీయం చేస్తున్నారు’) చినరాజప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత జ్యోతులు నెహ్రూ తీవ్రంగా విబేధించారు. మైకులు పట్టుకొని మాట్లాడితే సరిపోదని విమర్శించారు. ముందు పార్టీ కేడర్కు నమ్మకం కలిగించాలన్నారు. నాయకుని చుట్టు ప్రదక్షణ చేస్తే నాయకత్వం రాదని ఎద్దేవా చేశారు. పార్టీ కేడర్ చూట్టు ప్రదక్షణలు చేయాలన్నారు. చినరాజప్ప మరింత బాద్యతగా వ్యవహరించాలన్నారు. పదవులు రావడమనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. జిల్లాలో తనకు తెలియకుండానే పలు కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు రాష్ట్ర కమిటీ నాయకులు వస్తే కనీసం సమాచారం ఇవ్వడం లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
టీడీపీ నేతలకు చుక్కెదురు
కాకినాడ: పేదలకు పంచేందుకు సిద్ధం చేసిన భూములను మడ అడవులుగా చూపే ప్రయత్నంలో ఏర్పాటైన టీడీపీ నిజ నిర్థారణ కమిటీకి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని దుమ్ములపేటలో చుక్కెదురైంది. ప్రభుత్వం సేకరించిన భూమి వద్దకు శుక్రవారం వచ్చిన టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, జవహర్లతో కూడిన కమిటీతో పాటు స్థానిక టీడీపీ నేతలను లబ్ధిదారులు నిలువరించారు. కాకినాడ దుమ్ములపేట స్థలం వద్దకు చేరుకున్న టీడీపీ నేతలను నిరసిస్తున్న లబ్ధిదారులు టీడీపీ హయాంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని, వేరొక కంపెనీకి 75 ఎకరాల స్థలాన్ని కేటాయించగా లేని అభ్యంతరాలు ఇప్పుడేమిటని నిలదీయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులు కమిటీకి నచ్చచెప్పి పంపేయడంతో లబ్ధిదారులు కూడా వెళ్లిపోయారు. దీంతో వివాదం సద్దుమణిగి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement